Mane Praveen

Apr 28 2024, 11:35

NLG: మర్రిగూడ మండలంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సిపిఎం నాయకులు.

పార్లమెంటు ఎన్నికల్లో భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి , నిర్వీర్యం చేసే పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపాలడుగు నాగార్జున అన్నారు. మర్రిగూడ మండలం తిరుగండ్లపల్లి గ్రామంలో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో జీఎస్టీ పేర ప్రజలపై అధిక పన్నులు మోపిందని ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచిందని పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచి పెట్టిందని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. దేశంలో సమతుల్యత లేని అభివృద్ధిని మోడీ చేస్తున్నారని దక్షిణ భారతదేశంలో నిధుల కేటాయింపులు, నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణం, రైలు మార్గాల నిర్మాణం లేదని ఆరోపించారు. తీవ్రమైన నిర్లక్ష్యం వివక్షత చూపుతున్నారని తెలిపారు. కేవలం అంబానీ ఆధానీల మెప్పు కోసమే దేశ సంపదను లూటీ చేస్తున్నారని అన్నారు. జీరో అకౌంట్ ద్వారా 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే మాట జూట అని అన్నారు. 

ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. ఏకకాలంలో పంటల రుణమాఫీ రెండు లక్షలు చేయాలని ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నుండి వ్యతిరేకత తప్పదని తెలియజేశారు. ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే అభ్యర్థి జహంగీర్ అని అన్నారు. సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కాగు వెంకటయ్య, చెల్లం ముత్యాలు, నారోజు అంజయ్య,బుర్రి పెంటయ్య, లక్షమ్మ, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 27 2024, 20:02

మేడే ను జయప్రదం చేయండి: పల్లా దేవేందర్ రెడ్డి

ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని తెలిపారు.

1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో, కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని, కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు.

104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలిశెట్టి ఆర్ 1923వ సంవత్సరంలో మద్రాసు నగరంలో ఎగరవేశారన్నారు.

తాడిత పీడత అనగారిన వర్గాల శ్రేయసు కై పోరాడేది కేవలం ఎర్రజెండా నేనన్నారు. కార్మికుల సంక్షేమం కొరకు జరిగే పోరాటానికి ఏఐటీయూసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పండుగకు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఆంక్షలు పెట్టకూడదని ఆయన ఈ సందర్భంగా అధికారులను కోరారు. మే డే స్ఫూర్తితో భవిష్యత్తులో కార్మికుల హక్కుల సాధనకై పోరాడరని ఆయన ఈ సందర్భంగా కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, లెనిన్, గుండె రవి, జానీ, యూసఫ్, మదార్ దస్తగిరి, బుర్రి రాములు, యాదయ్య, నాగరాజు, కొండ రాములు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 27 2024, 17:53

NLG: మేడే పోస్టర్ ఆవిష్కరణ

ప్రపంచ కార్మిక పోరాట దినోత్సవం 138వ మేడే వారోత్సవాలను కార్మికులు వాడవాడలా ఎర్రజెండాలను ఎగురవేసి ఘనంగా జరపాలని CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు పిలుపునిచ్చారు. స్థానిక శ్రామిక భవన్ లో IFTU ఆధ్వర్యంలో ముద్రించిన గోడ పోస్టర్ లను ఈ రోజు ఆవిష్కరించి మాట్లాడారు. వారు మాట్లాడుతూ..

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడులు గా కుదించి, కార్మికులను కట్టు బానిసలుగా చేసే కుట్రకు వడిగట్టిందని ఆరోపించారు. 8 గంటలకు బదులు 12 గంటలు పనిచేసే విధానాన్ని తీసుకువచ్చి కార్పొరేట్, బహుళజాతి సంస్థలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేశారన్నారు.

దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను, శ్రమజీవుల మధ్య ఐక్యత పై దాడి చేస్తుందన్నారు. కార్మిక వర్గం ఇటువంటి విభజన విధానాలను తిప్పికొట్టాలని బిజెపి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రైవేటీకరణ, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంపు వంటి ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, స్కీం రంగాల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మిక వర్గం ఐక్యతను విస్తృతం చేసి బలమైన కార్మిక పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్ రంగ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు నెలకు 15 వేలు ఆర్దిక సహాయం అందించి ఆదుకోవాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ,సామాజిక భద్రత కల్పించాలని, వేతనాలను ప్రతినెల ఇవ్వాలని అన్నారు. కేంద్రం లో, రాష్ట్రంలో పాలకులు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేకత విధానాలపై కార్మికులు, ప్రజలు ఉద్యమించాలని , మేడే వారోత్సవాలు వాడవాడలా జరపాలని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి చారి, భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) రావుల వీరేష్, పొట్లపల్లి రామకృష్ణ, కత్తుల లింగస్వామి, తీగల నరసింహ, అక్కనపల్లి అంజి, మేకల మహేష్, ఊట్కూరు దశరథ, జింజిరాల సైదులు, మామిడాల ప్రవీణ్, రావుల గణేష్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.

Mane Praveen

Apr 25 2024, 21:33

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బాలు నాయక్

చందంపేట మండలం, బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ హన్మా నాయక్ కుమార్తె శోభారాణి-శరత్ కుమార్ వివాహ రిసెప్షన్ కు గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు జాలే నరసింహారెడ్డి, చందంపేట జడ్పిటిసి బుజ్జి లచ్చిరాం నాయక్, ఎంపీపీ పార్వతి చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు

SB NEWS

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 25 2024, 21:26

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి పత్రం

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం సూచన మేరకు ఈరోజు టీజి సిజిటిఏ నల్లగొండ జిల్లా యూనిట్ బాధ్యులు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రిజిస్టార్ అల్వాల రవి ని కలిసి, యూజీసీ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు ఆరు వారాలకు తగ్గకుండా ఇవ్వాలని, విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి జూన్ 23 వరకు వేసవి సెలవులను ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మునీర్, ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, సుదర్శన్ రెడ్డి,. తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 25 2024, 21:25

నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 505. 70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6, 841 క్యూసెక్కులు నమోదు కాగా, ఇన్ ఫ్లో లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 25 2024, 12:32

పేద ప్రజల పక్షాన పోరాడే జాహంగీర్ నే గెలిపించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: కమ్యూనిస్టుల పోరాట ఫలితమే ఉపాధి హామీ చట్టం వచ్చిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. ఈరోజు మర్రిగూడెం మండలం నిమ్మలగుట్ట దగ్గర ఉపాధి హామీ కూలీలను కలిసి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్లను అడగడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాలుగా పేద ప్రజల కోసం అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించిన జాంగిర్ను గెలిపించండి అని ఆయన కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టలు కొడుతూ నిధులకు కోత పెట్టిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసేయాలని ఆలోచన వెనక్కి తీసుకొని పని దినాలు కూడా 200 రోజులు పెంచి, గిట్టుబాటు కూలిరేట్లను కట్టించి ఎండ తీవ్రతలకు తట్టుకునే టెంట్లను, మంచినీళ్లు తదితర మౌలిక వసతులు కల్పించి ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలన్నారు. మీ అమూల్యమైన ఓటు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి కమ్యూనిస్టులను చట్ట సభలకు పంపిస్తే ఇలాంటి అనేక చట్టాలను తీసుకురావడానికి దోహదపడుతూ, పేద ప్రజల పక్షాన నిలబడే జాంగిర్ను గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి, మర్రిగూడెం మండలాల కార్యదర్శి లు నాంపల్లి చంద్రమౌళి, ఏర్పుల యాదయ్య, నల్గొండ పార్లమెంట్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటీ శంకర్, రాములు, యాదమ్మ, మారమ్మ, ప్రమీల, సుధాకర్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Apr 25 2024, 11:58

NLG: జిల్లా బిజెపి కార్యాలయంలో ఓబీసీ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం

నల్లగొండ: బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో OBC మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఓ బి సి మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ అధ్యక్షతన ఓబీసీ మోర్చా సామాజిక సమ్మేళనం బుధవారం నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంటుకు సంబంధించిన నాలుగు అసెంబ్లీ లు (మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, మరియు నల్లగొండ,) ల ఓబీసీ మోర్చా మండల కార్యవర్గాలతో బీసీ సమ్మేళనం నిర్వహించడం జరిగినది. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా OBC మోర్చ రాష్ట్ర అధ్యక్షులు పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. దేశానికి భారత ప్రధాని చేస్తున్నటువంటి నిరంతర కృషిని కొనియాడారు. ముఖ్యంగా బీసీ బిడ్డయినా ప్రధాని మోదీ సామాజిక న్యాయం కోసం అతని మంత్రివర్గంలో అత్యధికంగా 27 మందికి స్థానం కల్పించి, తన సామాజిక న్యాయం చాటారు మరియు బీసీలను అన్ని రకాలుగా అభివృద్ధి పరచటానికి ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన క్రింద 18 రకాల చేతి వృత్తిదారులకు ఎలాంటి పూచీకత్తు లేని రుణ సదుపాయాలను కల్పిస్తూ, తను బీసీల పట్ల గల ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

ఏ రాజకీయ పార్టీ చేయని సాహసం.. తెలంగాణకు బీసీ వ్యక్తిని సీఎం గా ప్రకటించి బీసీల ప్రక్షాళన కోసం చూపిన ఆదరణ నిరూపించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. మరొకసారి మోదీ ప్రధాని కావడం వందకు రెండు వందల శాతం రుజువు అయిందని బిజెపికి వచ్చే 400 + లో నల్లగొండ పార్లమెంటు ఉంటే మన నల్లగొండ అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఐకమత్యంగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో గంధ మల్ల ఆనంద్ గౌడ్ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు,

నాగం వర్షిత్ రెడ్డి గారు నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు, 

చాడ శ్రీనివాస్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ ప్రబారి,

అన్నం ఈశ్వరప్ప ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,

జక్కలి రాజు యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి,

మదన్ మోహన్ OBC మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యాదగిరి చారి ఓబీసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నేతల వెంకటేష్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భవాని ప్రసాద్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఏరుకొండ హరి నల్లగొండ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి,

తిరందాస్ కనకయ్య ఓబిసి మోర్చా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్ఛ జిల్లా అధికార ప్రతినిది, సామగాని దినేష్ గౌడ్, మరియు మహేష్, నరేందర్ గౌడ్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

Apr 24 2024, 09:48

NLG: పేదింటి బిడ్డ పెళ్లికి సాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం, మాల్ పట్టణంలోని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు సేవలు నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు చంద్రయ్య అంధుడు మరియు పేదరికంలో ఉన్నాడు. ఆయన చిన్న కూతురు వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ ముత్తు రూ.10,000 ఆర్థిక సహాయంగా అందించారు.

ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ పేదలకు సహాయాన్ని అందిస్తుందని, ఆకలితో ఉన్న వారికి అండగా ఉంటుందని, ఎవరికి సహాయం కావాలన్నా తమ ఫౌండేషన్ ను సంప్రదించాలని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 23 2024, 22:32

NLG: లెంకలపల్లి లో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

నల్లగొండ జిల్లా: మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు.

అనంతరం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర ను దేవాలయం నుండి ప్రారంభించి గ్రామంలో ఊరేగింపు గా బయలుదేరి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG